ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది పది మందిని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. జగన్ లాల్ యాదవ్ (52) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం హత్యకు గురైనట్లు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగన్లాల్ అనే రైతు తన పూర్వీకుల నుంచి ఆ ఆస్తిని వారసత్వంగా పొందుతూ వచ్చాడు. అయితే ప్రస్తుతం అతని ఆస్తికి మంచి డిమాండ్ ఉండడంతో ఆస్తి కోసమే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తర ప్రదేశ్,భోజిపురాకు చెందిన జగన్లాల్ యాదవ్(52) అనే రైతుకు 1990 లో వివాహం జరిగింది. అయితే అతనికి పిల్లలు కలగకపోవడంతో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాహం చేసుకుంటూనే వున్నాడు. ఈ విధంగా జగన్లాల్ పది పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీరిలో ఐదుగురు చనిపోగా ముగ్గురు ఇతరులతో వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరు భార్యలతో జీవనం కొనసాగిస్తున్న జగన్లాల్ మూడు రోజుల క్రితం తన పంట పొలం పక్కన ఉన్న రహదారిలో హత్యకు గురయ్యాడు.
జగన్లాల్ కు పిల్లలు లేక పోవడంతో తన భార్య మొదటి భర్త సంతానమైన ఒక కొడుకుతో కలిసి ఉన్నారు. తన ఆస్తి మొత్తం తన దత్తపుత్రుడిగా రాయించాలని కొద్ది రోజుల క్రితం భావించిన జగన్లాల్ ఈ విధంగా హత్యకు గురవడంతో ఆస్తి కోసమే ఇతని పై హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావించారు. ఈ హత్యపై భోజిపురా స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ.. హత్య సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం జగన్ లాల్ తలపై బలంగా కొట్టి.. గొంతు కోసి చంపినట్లు నిర్ధారించారు.