Leafy veggies : మన ఆరోగ్యానికి కూరగాయలతో పాటు..ఆకుకూరలు కూడా ఎన్నో అద్భుత ఫలితాలని ఇస్తున్నాయి.వారం లో కనీసం మూడు సార్లు అయినా వీటిని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, ఆకుకూరలతో Leafy veggies పొందవచ్చు. ఎలా ఎదో ఒకరూపం లో ఆకు కూరలు తీసుకునే వారి జీవనం ఎంతో ఆరోగ్యం గా సాగుతుంది. అయితే ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకు కూరల పెంపకం లో వాడే క్రిమి సంహారకాలు మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నాయి.
మనం తినే ఆకుకూరలు రోగ కారణాలవుతున్నాయి. ఎందుకంటే ఆకుకూరలకు పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు వాటి మీద పేరుకుపోయిన అవశేషాలు మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్లి పోతున్నాయి. అయితే ఇక్కడ సమస్యేంటి అంటే .. ఆకుకూరలు మీద పేరుకుపోయిన ఈ అవశేషాలు మానవ శరీరంలో ఇంచుమించుగా 20 ఏళ్ల పాటు నిల్వ ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ తాజా పరిశోధనలో తేల్చింది.
ఆకుల మీద ఉండే ఆర్గానో క్లోరిన్ అవశేషాలు తమిళనాడు రాష్ట్రంలో సగటున 9 శాతం వరకు ఉంటే, తెలంగాణలో మాత్రం 9-30 శాతం దాకా ఉంటున్నాయని ఎన్ఐఎన్ హెచ్చరించింది.
దీనివల్ల అనేక జబ్బులు వస్తాయని … నానాటికీ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ఇదే కారణమని కూడా తెలియచేసింది. గోంగూర, పాలకూర, తోటకూర, బెండకాయ,వంటి వాటిని ఉప్పు కలిపిన నీటిలో 10 నిమిషాల పాటు ఉంచి లేదంటే గోరువెచ్చని నీటిలో ఉంచి ఆ తరువాత పరిశుభ్రమైన నీళ్లతో కడిగి వేసుకుంటే మాత్రమే ప్రమాదం తప్పుతుందని తెలియచేస్తున్నారు.ఆరోగ్యవంతమైన ఆహారం కోసం ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ఉండక తప్పదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?