మయన్మార్ రాజకీయ నేత ఆంగ్ సాంగ్ సూకీకి స్థానిక కోర్టు మరో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. గత 18 నెలల నుంచి ఆమెపై వచ్చిన పలు ఆరోపణలపై ఆ దేశ సైనిక కోర్టు విచారణ జరిపి ఈ శిక్ష ఖరారు చేసింది. దీంతో ఆమెకు వివిధ కేసుల్లో పడిన జైలు శిక్ష మొత్తం 33 ఏళ్లకు చేరుకున్నది. 2021 ఫిబ్రవరి లో ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యం చేజిక్కించుకున్నది. అప్పటి నుండి అంగ్ సాన్ సూకీ హౌస్ అరెస్టు హౌస్ అరెస్టులో ఉన్నారు. మొత్తం 19 అభియోగాలపై ఆమె విచారణను ఎదుర్కొన్నారు. సుకీని విడుదల చేయాలని యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇటీవలే ఓ ప్రకటనలో కోరింది. సూకీపై ఉన్న చివరి అయిదు కేసుల్లో శుక్రవారం విచారణ జరిగింది, ఆమె అవినీతికి పాల్పడినట్లు సైనిక కోర్టు దోషిగా తేల్చింది.
హెలికాఫ్టర్ ను ఓ మంత్రికి రెంట్ ఇచ్చిన విషయంలో ఆమె నియమావళిని ఉల్లంఘించినట్లు తెలిసింది. గతంలో 14 కేసుల్లో ఆమెను విచారించారు. కోవిడ్ నియమావళి ని ఉల్లంఘించడంతో పాటు వాకీ టాకీలను దిగుమతి చేయడం, అధికారిక రహస్య చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలోనూ ఆమెను విచారించారు. ఇక ఆమెపై ఎలాంటి చార్జీలు పెండింగ్లో లేవని కోర్టు వర్గాలు తెలియజేశాయి. కాగా సూకీ గతంలో సుమారు 26 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం 77 సంవత్సరాల వయసు ఉన్న ఆంగ్ సాన్ సూకీకి కోర్టు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినందు వల్ల తదుపరి ఆమె ముందున్న ఆప్షన్ ఏమిటనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.