డార్లింగ్ ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. కెజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. కాగా ఈ సినిమాకి సలార్ అన్న వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమాని హోంబలే నిర్మాణ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. అంతేకాదు 300 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాకి కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వం లో రూపొందబోతున్న ఆదిపురుష్ లో నటించాల్సి ఉంది. ఈ సినిమాని 3-డీ లో టీ-సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి నిర్మించనున్నారు.
అయితే ఆదిపురుష్ కంటే సలార్ ముందు సెట్స్ మీదకి రావడం అది కూడా ఎన్.టి.ఆర్ తో ఉండాల్సిన ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఫిక్సవడం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ని బాగా డిస్టర్బ్ చేసింది. వాస్తవంగా ప్రభాస్ కంటే ముందే ప్రశాంత్ నీల్ .. ఎన్.టి.ఆర్ తో చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా కూడా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ లో సినిమా కూడా వచ్చే ఏడాది అనౌన్స్ చేయబోతున్నారట.
మైత్రీ వారు ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ కూడా సిద్దం చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అంతేకాదు ప్రభాస్ – ప్రశాంత్ ల సలార్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినట్టే ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ ప్రాజెక్ట్ కూడా అలాగే సర్ప్రైజింగ్ గా అనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం.