ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్కు గాను అనేక చోట్ల భిన్న రకాల టెస్టులు చేస్తున్నారు. అయితే చాలా చోట్ల ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను చేస్తున్నారు. వీటి వల్ల ఫలితం త్వరగా వస్తుంది. దీంతో చికిత్స త్వరగా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టీ పీసీఆర్ అనే టెస్టును కూడా చేస్తున్నారు. ఇది కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే కరోనా టెస్టుల విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. అవేమిటంటే…
1. ప్రతి ఒక్కరూ కరోనా టెస్టు చేయించుకోవాల్సిందే ?
ప్రతి ఒక్కరూ కరోనా టెస్టు చేయించుకోవాల్సిన పనిలేదు. లక్షణాలు ఉన్నవారు టెస్టు చేయించుకోవాలి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుండడం, పెదవులు వాపులకు గురి కావడం.. తదితర తీవ్ర లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టెస్టు చేయించుకుని హాస్పిటల్లో చికిత్స పొందాలి. లక్షణాలు లేని వారు భయపడాల్సిన పనిలేదు. కరోనా జాగ్రత్తలు పాటించాలి. లక్షణాలు ఉన్నాయనుకుంటేనే టెస్టులు చేయించుకోవాలి.
2. యాంటీ బాడీ టెస్టు పాజిటివ్ వచ్చింది, నాకు కరోనా రాదు ?
దేశంలో చాలా మందికి కరోనా ఇప్పటికే వచ్చి తగ్గి ఉంటుందని సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు గాను వారు యాంటీ బాడీ టెస్టులు చేస్తున్నారు. అయితే శరీరంలో యాంటీ బాడీలు ఉంటే కరోనా రాదని అనుకోకూడదు. కరోనా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాల్సిందే. కాకపోతే యాంటీ బాడీలు ఉంటే కరోనా వచ్చి తగ్గిందని అర్థం చేసుకోవాలి. లేదా కరోనా ఉందని అర్థం చేసుకోవాలి. అందుకు తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. అంతేకానీ కరోనా రాదని అనుకోకూడదు.
3. కరోనా టెస్టులు 100 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇస్తాయి ?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టెస్టులు ఏవీ 100 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇవ్వవు. వాటిల్లో వచ్చే 30 శాతం ఫలితాలు తప్పుగానే ఉంటాయి. అందువల్ల కరోనా నెగెటివ్ వస్తే కరోనా లేదని అనుకోవద్దు. మళ్లీ టెస్టు చేయించుకోవాలి. అలాగే కరోనా పాజిటివ్ వస్తే చికిత్స తీసుకోవాలి. అంతేకానీ నెగెటివ్ వచ్చిందని అలాగే విడిచిపెట్టకూడదు.
4. కరోనా టెస్టుకు రక్త నమూనా సేకరిస్తారు ?
లేదు.. కరోనా టెస్టుకు రక్త నమూనా సేకరించరు. కేవలం ముక్కులో స్వాబ్ ఉంచి దాని ద్వారా నమూనా సేకరిస్తారు. కొందరికి ఉమ్మి సేకరించి కరోనా టెస్టు చేస్తారు. అంతేకానీ బ్లడ్ శాంపిల్ తీసుకోరు.
5. పిల్లలకు కరోనా టెస్టులు చేయించాల్సిన పనిలేదు ?
పిల్లలకు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అయితే వారికి కరోనా రాదని అనుకోకూడదు. వారికి కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టు చేయించాలి. అలాగే భౌతిక దూరం, చేతులను శానిటైజ్ చేసుకోవడం, మాస్కులను ధరించడంపై వారికి పెద్దలు అవగాహన కల్పించాలి.