Pushpa: ఓ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేయడం అంటే ఎంత ఎద్ద ఛాలెంజో స్వయంగా పుష్ప మూవీ మేకర్స్ మైత్రీవారు తాజాగా వెల్లడించారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్లో దర్శక, నిర్మాతలు పాన్ ఇండియన్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మొదటిసారి భారీ బడ్జెట్ సినిమాగా పుష్పను నిర్మించారు. ఈ సినిమా కేవలం నిర్మాతలకే కాదు దర్శకుడు సుకుమార్ – హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్లకు మొదటి పాన్ ఇండియన్ సినిమా.
ఇటీవల (డిసెంబర్ 17)న భారీ స్థాయిలో రిలీజైన పుష్ప సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత కాస్త నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. టెక్నికల్గా సినిమాకు చాలా మైనస్లున్నాయి. ఆ విషయాన్ని నిర్మాతలు ఒప్పుకున్నారు. రిలీజ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే యు ఎస్లో ఆశించినన్ని థియేటర్స్లో రిలీజ్ కాలేదు. ఇక మలయాళ వర్షన్ కూడా ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేశారు. అంతేకాదు ముందు నుంచి హిందీ మార్కెట్ మీద పెట్టుకున్న టార్గెట్ కూడా మిస్ అయింది.
Pushpa: పుష్ప పార్ట్ 2 వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి మొదలు..
సెన్సార్ కాకపోవడంతో అసలు హిందీ వెర్షన్ రిలీజ్ అవుతుందా లేదా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకి రిలీజ్ అయిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే 70 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని నిర్మాతలు తెలిపారు. ఇదే పక్కా ప్లాన్ ప్రకారం హిందీ, మలయాళ వెర్షన్లో అనుకున్న రోజునే రిలీజ్ చేసి ఉంటే వసూళ్ళు మరింత ఆసక్తికరంగా ఉండేవని వెలడించారు. ఇక పుష్ప పార్ట్ 2ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా ఏవీ కూడా కలిసొచ్చే అంశాలు కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.