Prabhas : ప్రస్తుతం భారతదేశంలో హీరో ప్రభాస్ కి ఉన్నంత మార్కెట్ మరే ఇతర స్టార్ కు లేదంటే అతిశయోక్తి కాదు. పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ వరుసగా చేసే అన్ని సినిమాలు భారీ బడ్జెట్ లోనే రూపొందుతున్నాయి. అతనిని నమ్ముకొని కోట్లు కుమ్మరించడానికి నిర్మాతలు అసలు వెనకాడడం లేదు.
ఇలాంటి సమయంలో ‘మహానటి’ తో అందరినీ మెప్పించిన నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మరొక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాదాపు 500 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందని స్వయంగా ప్రొడ్యూసర్లే తెలిపారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే సినిమా ప్రకటించిన తర్వాత నాగ అశ్విన్ ఈ సినిమా 2022 లో విడుదల కు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా అభిమానులకు రెండు అప్ డేట్ లు ఈ సినిమా గురించి రానున్నాయని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి అప్డేట్ అయితే ఇచ్చాడు. ఇక రెండవ అప్డేట్ ఈ నెల 26న రానుంది అని ప్రకటిస్తే చివరికి ప్రభాస్ అభిమానులకు నిరాశే మిగిలింది.
ప్రభాస్ అభిమాని ఒకరు నాగ అశ్విన్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పోస్ట్ చేస్తే అందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ క్షమించమని ఈనెల 26 కి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేమని ఇది సరైన సమయం కాదని రిప్లై ఇచ్చారు. ఇలా ఒక ప్రభాస్ అభిమాని ఎవరో ట్విట్టర్లో పోస్టు చేస్తే స్వయంగా దర్శకుడే క్షమాపణలు అడగడం అనేది అతని చాలా గొప్ప విషయం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!