అమరావతి, ఫిబ్రవరి 5 : ఇటీవల మంత్రి నారా లోకేష్ దావోస్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో లోకేష్కు వింత అనుభవం ఎదురయ్యిందని, మైనస్ 15 డిగ్రీల చలిలోనూ ఆయనలో వేడి పుట్టిందంటూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని చూపించడంపై నాగబాబు తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
“మై ఛానల్ నా ఇష్టం” అంటూ యూట్యూబ్లో ఒక ఛానల్ను ప్రారంభించిన నాగబాబు పలువురిపై ఇప్పటికే రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజా వీడియోలో లోకేష్ను, ఆంద్రజ్యోతి ఎండి రాధాకృష్ణనూ లక్ష్యంగా ఎంచుకున్నారు.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=wEqpYrkZ2SE