Naga Babu: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూమార్తె, బీజేపీ నేత విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీలు దిగటానికి అభిమానులు పోటీపడ్డారు. గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్న చిరంజీవిపై అభిమానులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. వారి ప్రేమాభిమానం కాస్త శ్రుతిమించి, ఆ కార్యక్రమంలో ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలా ఉంది.
Nagababu: దీంట్లో గరికపాటికి ఇబ్బంది ఏంటి
అయితే మెగాస్టార్ చిరంజీవి వచ్చిన వేదికపైకే ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు కూడా వచ్చారు. గరికపాటి ప్రవచనాలు చెప్తున్నప్పుడు మెగాస్టార్ అభిమానులందరూ ఒక్కసారిగా వేదిక పైకి వచ్చారు. అనంతరం అతనితో సెల్ఫీ దిగారు. అయితే ఫ్యాన్స్ని ఏమాత్రం హర్ట్ చేయకుండా చిరంజీవి ఫొటోలు దిగాడు. అయితే చిరంజీవిపై, అతని అభిమానులపై గరికపాటి బహిరంగంగానే నిర్మొహమాటంగా చాలా అసహనం వ్యక్తం చేశాడు. గరికపాటి చిరంజీవిపై అసహనం వ్యక్తం చేయడంపై నాగబాబు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. నాగబాబు ఇన్డైరెక్ట్గా గరికపాటిపై వ్యంగంగా స్పందించాడు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..’ అంటూ గరికపాటిని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశాడు.
నాగబాబు ఫిట్టింగ్ రిప్లై
డైరెక్ట్గా చిరంజీవిని చూసి అసూయ పడుతున్న గరికపాటి అని అనకుండా ఇన్డైరెక్ట్గా పరిపాటే అంటూ నాగబాబు సెటైర్ వేశాడు. నాగబాబు సెటైర్కి మెగా ఫ్యాన్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. నిజానికి మెగా బ్రదర్ నాగబాబు తన ‘అన్నయ్య చిరంజీవి ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే అతను అసలు ఊరుకోలేడు. తమ్ముడు పవన్ను ఎవరైనా ఏదైనా అంటే కూడా అతను వెంటనే రంగంలోకి దిగి తనదైన శైలిలో సమాధానం చెప్తాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది.