అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అక్కినేని నాగ చైతన్య. జోష్ చిత్రంతో తన డెబ్యూ ఇచ్చిన చెయ్ మొదటగా బాగా ఇబ్బంది పడ్డాడు. అయితే రీసెంట్ గా చైతన్య బాగా కుదురుకున్నట్లే కనిపించాడు. గతేడాది నాగ చైతన్య నటించిన సినిమాలు రెండూ సూపర్ హిట్ సాధించాయి.
మజిలీ, వెంకీ మామ చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో నాగ చైతన్య కెరీర్ సాఫీగా సాగుతోంది. రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ ఎప్పుడూ చైతన్య బలం. అందుకే ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఎప్పటినుండో శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు చైతన్య. మొత్తంగా లవ్ స్టోరీతో అది కుదిరింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన విషయం తెల్సిందే. అయితే రీసెంట్ గా సేఫ్టీ మెజర్స్ తీసుకుని షూటింగ్ ను ఓకే చేసారు. సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాట విడుదలవగా అది సూపర్ హిట్ అయింది. నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేద్దామని భావిస్తున్నారు. ఇక చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలవుతుందని రూమర్స్ వస్తున్నాయి.
వచ్చే నెల నుండి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నా 100 శాతం ఆక్యుపెన్సీ కచ్చితంగా ఉండదు. ఉంటే 30 శాతం లేదా 50 శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. దీంతో రెవిన్యూలు కూడా బాగా తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో ఓటిటి రిలీజ్ వైపే అందరూ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వి చిత్రం విడుదల కాగా అక్టోబర్ 2న నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా చిత్రాలు విడుదలవుతున్నాయి. అదే నేపథ్యంలో లవ్ స్టోరీ కూడా విడుదలవుతుందని భావించారు. అయితే నాగ చైతన్య మాత్రం ఈ విషయంలో అస్సలు టెంప్ట్ అవ్వను అంటున్నాడు. ఏది ఏమైనా లవ్ స్టోరీ థియేటర్స్ లోనే విడుదల చేయాలని అంటున్నాడు.