Naga Chaitanya Samantha: గత కొంత కాలం నుండి సోషల్ మీడియాలో సమంతా నాగ చైతన్య ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఈ క్రమంలో ఆమె నెట్ ఫ్లిక్స్ లో డైవర్స్ అనే వెబ్ సిరీస్.. ప్రమోషన్ కోసం విధంగా ప్రచారం చేస్తున్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అదే సమయంలో సన్నిహితుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు ఈ క్రమంలో సమంతాకు భరణంగా నాగార్జున ఫ్యామిలీ 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా.. సిద్ధమైనట్లు, ఆ ఆఫర్ ని సమంత సున్నితంగా.. తిరస్కరించినట్లు వార్తలు రావడం జరిగాయి.
వస్తున్న వార్తలు నిజమే…
కానీ ఈ విషయంలో నిన్నటి వరకు నాగచైతన్య లేదా సమంత ఎవరు కూడా స్పందించలేదు. దీంతో అక్కినేని అభిమానులు సినిమా ప్రేమికులు.. ఈ విషయంలో గందరగోళానికి గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా అధికారికంగా సమంతాకి విడాకులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుండి.. వస్తున్న వార్తలు నిజమేనని తెలియజేశారు. భార్యాభర్తలుగా తమ బంధాన్ని రాబోయే రోజుల్లో కొనసాగించడం లేదని పేర్కొన్నారు.
నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా పోస్ట్…
దశాబ్దం పైగా తమ మధ్య ఏర్పడిన స్నేహబంధం గొప్పది అని చెప్పుకొచ్చారు. ఇక నుండి మేము దూరంగా ఉండాలి అనుకుంటున్నా చాలా ఆలోచనలు చర్చలు జరిపి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నం. సొంత మార్గంలో ప్రయాణించాల్సి అనుకుంటున్నా పదేళ్లుగా మా స్నేహం కొనసాగింది నేను చాలా అదృష్టవంతులం వివాహబంధానికి చాలా కీలకం గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ కష్టకాలంలో అభిమానులు మరియు మీడియా మద్దతు ఎంతో అవసరమని.. నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. మొట్టమొదటిసారి నాగచైతన్య.. అధికారికంగా విడాకుల గురించి క్లారిటీ ఇచ్చినట్లు తెలపడంతో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. మరోపక్క నాగచైతన్య చేసిన పోస్ట్.. సమంత తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?