Naga Chaitantya: టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ ‘సామ్ చై’ విడిపోయాక ఎవరి లైఫ్లో వారు బిజీగా గడుపుతున్నారు. వీరిద్దరిలో సామ్(Samantha Ruth Prabhu) మాత్రమే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తన బాధను వ్యక్త పరుస్తూ వచ్చింది. కానీ, చైతూ మాత్రం సినిమా బిజీలో పడి పోస్టుల జోలికి పోలేదు. తమ వివాహబంధానికి బ్రేక్ తీసుకున్న దాదాపు 45 రోజుల తర్వాత తొలిసారి చైతూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది. అందరూ సామ్ గురించి పెట్టాడేమోనని అనకుంటున్నారు.
జీవితంలో ముందుకెళ్లడానికి మీ‘ప్రేమకథ’అవసరం..
ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్కు దూరమయ్యాక చైతూ సినిమా బిజీలో పడిపోయాడు. ఇన్నిరోజులు మౌనంగా ఉన్న చైతూ హాలీవుడ్ యాక్టర్ మాథ్యూ మాక నౌగే రాసిన ఆటో బయోగ్రఫీ ‘గ్రీన్లైట్స్ ’ను ప్రస్తావిస్తూ ఇన్ స్టా వేదికగా థాంక్స్ చెప్పాడు. 45 డేస్ బ్రేక్ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన చైతూ గ్రీన్లైట్స్ అనే పుస్తకాన్ని చదివి అందులోని విశేషాలను రాసుకొచ్చాడు. ‘జీవితానికి ప్రేమలేఖ.. గ్రీన్ లైట్స్’అని కామెంట్ చేసి ఆ బుక్ కవర్ పేజీ పిక్చర్ను కూడా పోస్టు చేశాడు. మీ ఆటో బయోగ్రఫీని మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్స్.. జీవితంలో ముందుకు సాగడానికి ఈ బుక్ ఎంతగానో యూస్ అవుతందని చెప్పుకొచ్చాడు చైతూ..
చైతూ ఎందుకిలా మారిపోయాడు..
సామ్ నుంచి విడిపోయాక చైతూ ఒంటరిగానే ఓ ఫ్లాట్ తీసుకుని ఉంటున్నట్టు తెలిసింది. పెద్దగా బయట కూడా కనిపించడం లేదు. సామ్ తనకు మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడని కొందరు అనుకుంటుండగా, తన మెమోరీస్ను మర్చిపోయేందుకే వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడని అనేవారు లేకపోలేదు. ఇన్నిరోజులు సామ్ మాత్రమే తన బాధను వ్యక్తపరుస్తూ పోస్టులు పెడుతూ వచ్చింది. ఆమెకు ఇండస్ట్రీలో చాలా మంది మద్దతుగా నిలిచారు. కానీ చై ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. ఎందుకిలా మారిపోయాడు. సామ్ ను ప్రేమించి పెళ్ళి చేసకున్న చైతూ వెంటనే మర్చిపోయాడా? ఎందుకు..? ఎవరికోసం? అని చాలా మంది మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?