Naga Chaitanya: అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు అక్కినేని నాగ చైతన్య. అయితే నాగ చైతన్య మొదటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వచ్చిన ఎం మాయ చేసావే సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య క్లాసిక్ గా సైలెంట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ఆ తరువాత నుంచి నాగ చైతన్య సినీ ప్రయాణం మనకి తెలిసిందే. ఆ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూథ్ ప్రభు ని వివాహం చేసుకున్నాడు.
నాగ చైతన్య లాస్ట్ టైం గా స్క్రీన్ మీద కనిపించింది మజిలీ సినిమాలో. అపుడు నుంచి మళ్ళి సినిమా చెయ్యలేదు. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఇదిలా ఉండగా కరోనా అప్పటి నుంచి స్టార్స్ అందరూ డిజిటల్ ప్లాట్ ఫారం మీద ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో చాలా మంది స్టార్ హీరోస్ మరియు హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించారు. ప్రస్తుతం ఓ వైపు సిల్వర్ స్క్రీన్ మీద నటిస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా తళుక్కుమంటున్నారు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీసన్ 2 లో నటించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. తాజాగా నాగ చైతన్య కూడా తన భార్య సమంత లాగా డిజిటల్ ప్లేట్ ఫారం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఓ సందర్భంలో చైతు మాట్లాడుతూ సిల్వర్ స్క్రీన్ పై కంటే డిటిజల్ ప్రపంచంలోనే నటీనటులకు ఫ్రీడమ్ ఉంటుందని ఓటీటీ మీద తనకు ఉన్న అభిమానాన్ని తెలియజేశాడు.