ఈ రోజుల్లో యాపిల్ ఫోన్ తెలియని వారే లేరు..! యాపిల్ ప్రొడక్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది.. ఇందులో డేటా సెక్యూరిటీ, పెద్దగా సమస్యలు రాకపోవడం, హ్యాక్ చేయడం కష్టం అనే ఉద్దేశంతో సెలబ్రెటీలు సైతం ఈ ఫోన్ కే ప్రాముఖ్యం ఇస్తుంటారు.. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున సైతం ఈ ఫోన్ వాడుతున్నారు.. అయితే యాపిల్ సేవలపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు..
యాపిల్ సేవలు.. ఏక పక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ రోజు ట్విటర్లో నాగ్.. తన కోపాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా యాపిల్ సేవల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘భారత్లోని యాపిల్ స్టోర్ నుంచి యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్ల సేవలు, పాలసీలు ఏక పక్షంగా ఉన్నాయని. ఇది మరీ ఘోరమైన చర్య.’ అని అన్నారు. అయితే, తన ఆగ్రహానికి గల కారణాన్ని మాత్రం నాగ్ బయటపెట్టలేదు..
ప్రస్తుతం అహిసోర్ సోల్మన్ దర్మకత్వంలో తెరకెక్కుతున్న ‘వైల్డ్డాగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన విజయ్వర్మ అనే ఎన్ఐఏ ఆఫీసర్గా కనిపించనున్నారు. దీనితోపాటు బాలీవుడ్లో రానున్న ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఆయన నటించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?