జబర్దస్త్ కామెడీ షో తరహాలో జీ తెలుగులో నాగబాబు ఆధ్వర్యంలో అదిరింది షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. చాలామంది జబర్దస్త్ కంటెస్టెంట్ లు షో నుండి బయటకు వచ్చేసిన వాళ్ళు ఈ షోలో దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ షో కి మెగా ఫ్యామిలీ అభిమాని, స్టార్ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గెస్ట్ గా రావడం జరిగింది.
ఎప్పుడూ గెస్ట్ గా వచ్చే వారిపై సెటైరికల్ కామెడీ స్కిట్ లు వేస్తూ బొమ్మ అదిరింది టీమ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వచ్చిన అతిధిని ఇమిటేట్ చేస్తూ వారిపై వారి బాడీ లాంగ్వేజ్ తరహాలో కామెడీ స్కిట్స్ వేస్తుంటారు. ఆ విధంగా గతంలో బొమ్మ అదిరింది షో కి అతిథులుగా వచ్చిన రాహుల్ రామకృష్ణ, శివ శంకర్ మాస్టర్, పోసాని కృష్ణమురళి వంటి వారిపై సెటైరికల్ స్కిట్ లు వేయటం జరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ అతిధిగా రావటంతో గతంలో పవన్ కళ్యాణ్ నటించిన “గబ్బర్ సింగ్” సినిమా ఆడియో వేడుక పై బండ్ల గణేష్ చేసిన ప్రసంగాన్ని ఇమిటేట్ చేస్తూ అదిరింది టీం కామెడీ పండించారు. ఆ ఆడియో వేడుకలో నీతి నిజాయితీ అంటే ఏమిటి నాన్న అని మా పిల్లలు నన్ను అడిగితే.. తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించాను అని చెప్పిన డైలాగ్ ని అదిరింది షో కంటెస్టెంట్ లు దారుణంగా వాడేశారు. ముఖ్యంగా సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ మేద బండ్ల గణేష్ పై చాలా సెటైర్లు రాజకీయరంగంలోనూ అదేవిధంగా మీడియాలోని పడ్డాయి. ఇప్పుడు అదే బ్లేడ్ తో బండ్ల గణేష్ పై అదిరింది స్టేజీపై అదిరిపోయే తరహాలో పంచ్ లు వర్షం కురిపించారు.