Uppena: ఫిబ్రవరి 12వ తేదీన మెగా కాంపౌండ్ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తప్పించి ఎవరూ రాలేదు. అలా ఎందుకు జరగవలసి వచ్చిందో మెగాబ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
“నేను వైష్ణవ్ తేజ్ ని చదువుకుంటావా? లేక ఇండస్ట్రీ కి వస్తావా? అని చాలా సార్లు అడిగాను. కానీ అతను ఎప్పుడూ కచ్చితంగా చెప్పలేకపోయాడు. నేను ఎంతో సీరియస్గా అడిగినప్పుడు కూడా స్పష్టమైన సమాధానం లేదు. ఒక రోజు నా దగ్గరకు వచ్చి ‘ఉప్పెన’ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పాడు. మొత్తానికి నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక కుర్రోడుకి మంచితనం కూడా ఎక్కువ. మాకున్న మెగా ఇమేజ్ ప్లస్ అయితే పర్వాలేదు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో అతను రీచ్ కాలేకపోతే అదే మైనస్ అవుతుంది.”
“మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. వాటిని అందుకోవాలంటే వరుణ్ తేజ్ కానీ ధరమ్ తేజ్ కానీ వైష్ణవ్ కానీ చాలా కష్టపడాలి. అందుకే కళ్యాణ్ బాబు సూచనలతో థాయిలాండ్ వెళ్లి బాక్సింగ్ నేర్చుకుని వచ్చాడు. మొన్నే వరుణ్, చరణ్, నిహారిక సినిమా చూశారు. చాలా బాగుంది అని చెప్పారు. వైష్ణవ్ కూడా మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు అని చెప్పారు. ఇక మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేము ఇంటిళ్ళపాది వెళ్ళడం కంటే వాడిని వాడిగా ప్రేక్షకులకి పరిచయం చేయాలని అనుకున్నాము. అందుకే రాలేదు. ఇక మా అందరికీ పెద్ద దిక్కు అన్నయ్య కాబట్టి అతని ఆశీర్వాదాలు వైష్ణవ్ కి దక్కాయి. టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి.” అని నాగబాబు అన్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!