Naga Chaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న జంటలలో సమంత నాగచైతన్య జంట చూడముచ్చటగా ఉండేది. ప్రతి ఒక్కరూ ఈ జంటను చూసి ఎంతో ముచ్చట పడేవారు. ప్రేమించి పెద్దలను ఒప్పుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట పది సంవత్సరాలు కలిసి ఉన్న జీవితంలో నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితానికి గత శనివారం గుడ్ బై చెప్పటం సంచలనంగా మారింది. చాలామందికి నిరాశను మిగిల్చింది. అక్కినేని అభిమానులు ఎంతగానో నిరాశ చెందుతున్నారు. వస్తున్న వార్తలు వాస్తవం కాకుండా ఉంటే బాగుంటుంది అని భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకున్నట్లు నాగచైతన్య సమంత ప్రకటించడంతో… సోషల్ మీడియా లో వీళ్ళ అకౌంట్ల పై ఫోకస్.. గతంలో కంటే మరింతగా పెరిగింది.
సాయి ధరమ్ తేజ్ పోస్ట్ కి రిప్లై …
ఇటువంటి తరుణంలో విడాకులు ప్రకటన చేసిన అనంతరం నాగచైతన్య తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ… పోస్ట్ పెట్టాడు. విషయంలోకి వెళితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయినందువల్ల చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను పూర్తిగా కోలుకున్నన్నీ త్వరలోనే కలుస్తున్నట్లు.. సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్ కి చైతు ఈ రీతిగా స్పందించడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటూనందుకు సంతోషంగా ఉంది అంటు… అతను పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇచ్చాడు. దీంతో నాగచైతన్య చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత డిజైనర్ ప్రితం జుకల్కరే…
ఇదిలా ఉంటే నాగచైతన్య.. సమంత విడాకులు తీసుకోవడానికి గల కారణాలు గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో విడాకులకు ప్రధాన కారణం సమంత డిజైనర్ ప్రీతం అని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే శ్యామ్ చై.. విడాకులు తీసుకున్న అనంతరం… ప్రితం జుకల్కరే ఇంస్టాగ్రామ్ లో రకరకాలుగా స్టేటస్ లు పెట్టడం జరిగింది. వెరైటీగా విడాకుల అనంతరం పోస్టులు పెట్టాడు. ఈ నేపథ్యంలో అని అభిమానులు అతన్ని తీవ్రస్థాయిలో తిడుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో అతని భయంకరంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరో పక్క ప్రీతం సమంత అని అక్క అని పిలుస్తాడు అని.. బయట టాక్. ఏది ఏమైనా సమంత నాగచైతన్య విడాకుల వార్త అక్కినేని అభిమానులను మాత్రమే కాక సినిమా ప్రేమికులను కూడా ఎంతగానో నిరాశపరిచిన మాట వాస్తవం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?