నాగార్జున అహిషోర్ సాల్మన్ అనే కొత్త దర్శకుడుని టాలీవుడ్కు పరిచయం చేస్తూ వైల్డ్ డాగ్ అన్న సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ‘వైల్డ్డాగ్’, బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర’ సినిమాలు ఇప్పటికే కంప్లీట్ చేసిన Nagarjuna ఈ సంక్రాంతి తర్వాత వరసగా కొత్త ప్రాజెక్ట్స్ ని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడట. ఇక ‘వైల్డ్ డాగ్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే సంక్రాంతి నుంచి బాక్సాఫీస్ వద్ద సందడి బాగానే మొదలవబోతోంది కాబట్టి Nagarjuna వైల్డ్ డాగ్ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తోంది.
కాగా Nagarjuna.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో బంగార్రాజు ని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా త్వరలో మళ్లీ సెట్స్ మీదకి రాబోతోందట. అలాగే Nagarjuna గరుడ వేగతో ఆకట్టుకున్న క్రేజీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు ఓకే చెప్పాడట. ఇంకోవైపు పూరీ జగన్నాథ్ తో ఓ సినిమాని మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి మొదలు పెడతాడని సమాచారం. వీటి తో పాటు Nagarjuna యాత్ర దర్శకుడు మహి వి రాఘవ కాంబినేషన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ సెట్ అయినట్టు తెలుస్తోంది.
మహి వి రాఘవ ‘ఆనందో బ్రహ్మ’, యాత్ర సినిమాలతో టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రశంసలు దక్కించుకున్నాడు. తాజాగా నాNagarjuna తో ఓ క్రైమ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే మహి వి రాఘవ చెప్పిన కథకు Nagarjuna ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా Nagarjuna 2021 లో కనీసం 3 సినిమాలతో అయినా ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు.యంగ్ హీరోలు నాగ చైతన్య .. అఖిల్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తుంటే Nagarjuna మాత్రం మంచి దూకుడు మీద ఉన్నాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!