మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈ ఈ ఏడాది పారంభంలోనే అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో అన్న సినిమా తీసి భారీ సక్సస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అయినను పోయిరావలె హస్తినకు అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లో 30 వ సినిమా కాగా హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించనున్నారని ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది.
కాగా ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఎన్.టి.ఆర్ ఇప్పట్లో బయటకి వచ్చేలా కనిపించడం లేదని అంటున్నారు. దాంతో త్రివిక్రం ఈలోపు మరో సినిమాని చేసేయ్యేలాని ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో త్రివిక్రం .. ఎన్.టి.ఆర్ కంటే ముందు మహేష్ బాబు తో సినిమా చేసేలా ఉన్నాడన్న వార్త తో పాటు యంగ్ హీరో రాం తో సినిమా చేయాలని డిసైడయినట్టు వార్తలు వస్తున్నాయి.
కాని ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎక్కడా వెలువడలేదు. ఈలోపు మరో న్యూస్ బయటకి వచ్చింది. వీలైతే త్రివిక్రం ని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో ఒక సినిమా చేసి పెట్టమని అడిగినట్టు సమాచారం. వాస్తవంగా అఖిల్ తో సినిమా చేయమని నాగార్జున ఇంతకముందే త్రివిక్రం కి చెప్పాడట. కాని ఎందుకనో ఈ ఈదరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్ అవలేదు. ఇక నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మన్మధుడు కి త్రివిక్రం కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మరి ఈసారైనా అఖిల్ తో త్రివిక్రం సినిమా చేస్తాడా లేదా చూడాలి.