Nagarjuna : యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. మూడు నెలల కిందట చివరి షెడ్యూల్ పూర్తిచేసుకున్న కింగ్ నాగార్జున, బిగ్ బాస్ తో బాగా బిజీ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ బిగ్బాస్ కూడా అయిపోయి రెండు నెలలు అవుతుంది. అయితే నాగార్జున మాత్రం ఏమి చేస్తున్నాడో ఎవరికి క్లారిటీ లేదు.
కొత్త సినిమా మొదలు పెట్టలేదు. మరే కార్యక్రమంలోనూ కనిపించలేదు. ‘వైల్డ్ డాగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు అనుకుంటే అది అలాంటిది కూడా ఏమీ లేదు. ఈ సినిమాపై ఎక్కడా మాట్లాడనూలేదు కూడా. కానీ అక్కినేని అభిమానులకు తాజాగా వచ్చిన అప్ డేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ లో నాగార్జున బ్రహ్మాస్త్రా అనే భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాతగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ నిడివి ఉండే కీలక పాత్రలో నటించాడు. ఇంతకు ముందు షెడ్యూల్ లో భాగంగా యూరప్ వెళ్లి వచ్చిన నాగార్జున ఇప్పుడు బాంబే లో షెడ్యూల్ కి హాజరయ్యాడు. మొత్తానికి నాగార్జున పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయింది.
ఇప్పటివరకూ ఈ మధ్య కాలంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర నటులు బాలీవుడ్ గడప తొక్క లేదు. అలాంటిది నాగార్జున వెళ్లి ‘బ్రహ్మాస్త్ర’ ప్రాజెక్టులో కీలక పాత్ర చేయడం విశేషమే. చిరంజీవి, బాలకృష్ణ తో పోలిస్తే నాగార్జునకి అన్నపూర్ణ స్టూడియోస్ ద్వార ‘బిగ్ బాస్’ హోస్ట్ గా బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. దానిని బాగా వాడుకొన్న నాగార్జున నుంచి బాలీవుడ్ సినిమాల్లో మరికొన్ని ప్రాజెక్టులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?