Nagrjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలవగానే కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. దాంతో గోవాలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ తర్వాత షూటింగ్కి బ్రేక్ పడింది. ఐతే అన్ని సినిమాలు మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టినప్పటికి నాగార్జున మాత్రం ఎందుకనో డైలమాలో పడ్డాడు. వాస్తవంగా ఈ సినిమాకి దాదాపు అన్నీ షెడ్యూల్స్ విదేశాలలో ప్లాన్ చేశారు. అయితే కరోనా విస్తృతి వల్ల ఆ షెడ్యూల్స్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ షెడ్యూల్ చేశారు.
అందుకు నాగార్జున చాలా సపోర్ట్ చేశాడట. దీని కోసం ఓ భారీ సెట్ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వేసుకోమని చెప్పారట. దాంతో భారీ సెట్ ఇక్కడే నిర్మించారు. ఆ సెట్ లో తాజాగా షెడ్యూల్ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వదిలారు. త్వరలో బంగార్రాజుతో సెట్స్ మీదకి రానున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందే ప్రవీణ్ సత్తారు సినిమాను సెట్ మీదకి తీసుకు వచ్చారు. అంతేకాదు నాన్ స్టాప్గా చిత్రీకరణ జరిపి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయనున్నారు.
Nagrjuna : నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా కూడా దింపనున్నట్టు తెలుస్తోంది.
ఇక అన్నీ అనుకున్నట్టు గనక పూర్తయితే ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ మడుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అప్పటికి పుష్ప, బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా, కేజీఎఫ్ 2 సినిమాలు రెడీ అవుతున్నాయి. ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే 2022 సంక్రాంతికి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం, మహేశ్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటిల అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. వీరికి పోటీగా నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా కూడా దింపనున్నట్టు తెలుస్తోంది.