కరోనా వైరస్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ఇప్పటికే కరోనా బారిన పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే.. కొందరు వెంటనే కరోనా నుంచి తప్పించుకున్నారు. తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కూడా గత వారం కరోనా సోకింది.
జ్వరం రావడంతో టెస్ట్ చేయిస్తే ఆయనకు కరోనా వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు వెంటనే హోం క్వారంటైన్ కు వెళ్లారు.
తనతో కలిసి తిరిగిన వాళ్లందరూ వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని నాయిని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నాయిని ఇప్పటి వరకు చికిత్సకు సహకరించారు. ఆరోగ్యం కూడా కుదుటపడింది. కానీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా నాయిని ఆరోగ్యం తిరగబడిందట.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందట. దీంతో వెంటనే అదే ఆసుపత్రిలో ఐసీయూకు ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం నాయిని ఆరోగ్యం విషమంగా ఉందని.. ఐసీయూకు తరలించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.