వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భారీ ఊరట లభించింది. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. షర్మిలతో పాటు మరో అయిదుగురు వైఎస్ఆర్ టీపీ నేతలపై పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ పీఎస్ లోనే షర్మిల కు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు రాత్రికి నాంపల్లి కోర్టులో పోలీసులు హజరుపర్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ పోలీసుల రిమాండ్ రిపోర్టును తిరస్కరించి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. షర్మిలతో పాటు మరో అయిదుగురు నాయకులకు బెయిల్ మంజూరైంది.
ముందుగా మెజిస్ట్రేట్ వద్ద పోలీసుల తరుపున రిమాండ్ ప్రధాన అంశంగా వాదనలు సాగాయి. షర్మిల తరపు న్యాయవాదులు పోలీసుల వాదనను వ్యతిరేకిస్తూ తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని వాదనలు వినిపించారు. శాంతి యుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్లే అక్రమంగా అరెస్టు చేశారని పోలీసుల తీరును తప్పుబట్టారు. పోలీసుల విధులకు షర్మిల ఎక్కడా ఆటంకం కల్గించలేదని ఆమె తరుపున వాదనలు వినిపించారు న్యాయవాదులు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ముందస్తుగా సహకరించాలని కోరినా వినకుండా పోలీసులనే దుర్భాషలాడారని, ఆ సమయంలో వీడియో తీసుకుంటే పోలీస్ వద్ద సెల్ పోన్ కూడా షర్మిల లాక్కున్నారని పోలీసుల తరపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. సుదీర్గంగా వాదనలు ముగిసిన అనంతరం మెజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు అయిన తర్వాత రాత్రి 10.30 గంటల ప్రాంతంలో షర్మిల నాంపల్లి కోర్టు వద్ద మీడియాతో మాట్లాడకుండానే నేరుగా కారులో లోటస్ పాండ్ కు బయలుదేరి వెళ్లారు.
లోటస్ పాండ్ ఇంటి వద్దే వైఎస్ విజయమ్మ నిరసన