అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్పర్సన్గా నందమూరి లక్ష్మీపార్వతి నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్వి ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
టిడిపి వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు రెండవ భార్య అయిన లక్ష్మీపార్వతి ఎన్టిఆర్ మరణానంతరం ఎన్టిఆర్ టిడిపిని స్థాపించారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో నందమూరి లక్ష్మీపార్వతి జగన్మోహనరెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపిలో అంటూ లక్ష్మీపార్వతి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు ఆయనపై కోర్టులో కేసు వేశారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ వైసిపి తరపున లక్ష్మీపార్వతి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. వివిధ సందర్భాలలో మీడియా సమావేశాల్లో టిడిపిపైనా, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో లక్ష్మీపార్వతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీకి లక్ష్మీపార్వతి అందిస్తున్న సేవలను గుర్తించిన సిఎం జగన్మోహనరెడ్డి తెలుగు అకాడమి చైర్పర్సన్ పదవికి ఎంపిక చేశారు.