(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, యువత గత 28 రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని గ్రామాల్లో వీరు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలియజేస్తున్నాయి. తాజాగా దివంగత టిడిపి నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని నేడు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులు, రైతు కూలీల ఆందోళనకు సంఘీభావం తెలపనున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో మహిళలను సుహాసిని పరామర్శించనున్నారు.