Shyam singh roy : శ్యామ్ సింగరాయ్.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా. వి తర్వాత నాని కరోనా ప్రభావాన్ని కూడా లెక్కచేయకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయ్యాడు. ఇప్పటికే నిన్నుకోరి, మజిలీ ఫేం శివ నిర్వాణతో టక్ జగదీష్ సినిమాను కంప్లీట్ చేశాడు. ఇది హిట్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. డైరెక్టర్ కి ఇది హ్యాట్రిక్ సినిమా. ముందు చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్. దాంతో టక్ జగదీష్ తో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనే నమ్మకంతో ఉన్నాడు. సినిమాను కూడా చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు. అయితే కరోనా కారణంగా రిలీజ్ ఆగింది.
ఈ క్రమంలో మిగతా సినిమాలను ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి నానీ రెడీ అయ్యాడు. వీటిలో ముందుగా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ మొదలు పెట్టాడు. టాక్సీవాలా సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా స్టెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయినా ఫైనల్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. సినిమా 1960-70 కాలం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం పూర్తి చేశారు.
Shyam singh roy : నాని హీరోగా సినిమాలు చేస్తూనే మరోక వైపు ప్రయోగాత్మక సినిమాలు నిర్మిస్తున్నాడు.
తాజాగా మొదలు పెట్టిన షెడ్యూల్ లో ప్రస్తుతం జనరేషన్ కి సంబంధించిన సీన్స్ బ్యాలెన్స్ ఉండగా వాటిని తెరకెక్కిస్తున్నారట. వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా మరో సినిమా అంటే .. సుందరానికి సినిమా కూడా తిరిగి త్వరలో సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు నాని హీరోగా సినిమాలు చేస్తూనే మరోక వైపు ప్రయోగాత్మక సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో మీట్ క్యూట్ ప్రకటించాడు. ఇప్పటికే అధికారకంగా అదా శర్మ కన్ఫర్మ్ అయింది.