ఇటీవల కృష్ణాజిల్లా పర్యటనలో మచిలీపట్నం అదేవిధంగా గుడివాడ నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని అదేవిధంగా కొడాలి నాని ని ఉద్దేశించి భారీ స్థాయిలో పవన్ డైలాగులు వేయడం జరిగింది. శతకోటి లింగాలలో బోడిలింగలు అంటూ.. సెటైరికల్ గా విమర్శలు చేయటం.. వాటికి కొడాలి అదేవిధంగా పేర్ని నాని లు ఇద్దరూ భారీ స్థాయిలోనే కౌంటర్లు ఇవ్వడం జరిగింది.
పవన్ చేసిన కామెంట్లు వైసీపీ నేతలకు భారీ స్థాయిలోనే ఆగ్రహాన్ని తెప్పించాయి. చంద్రబాబు ని తిట్టడం పవన్ కి ఇష్టంలేక ఆగమేఘాలమీద కృష్ణాజిల్లాలో పర్యటించడం జరిగింది అని, టిడిపి పార్ట్నర్ అంటూ పవన్ పై సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి తరుణంలో తాజాగా మినిస్టర్ పేర్ని నాని ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరొక సారి పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు.
నకిలీ కోర్టు వేసుకున్న వకీల్ సాబ్ అంటూ ఆయన పై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తో పోల్చుకుంటే తాను బోడిలింగం కాదు అంటూ కూడా పేర్కొన్నారు. చిరంజీవి పేరు చెప్పి సినిమాల్లో రాణించి తరువాత రాజకీయాల్లో తాను కానిస్టేబుల్ కొడుకుని అంటూ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు అటువంటి వ్యక్తి నన్ను బోడిలింగం అనటం హాస్యాస్పదం అంటూ పవన్ పై పేర్ని నాని సెటైర్లు వేశారు.