Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలన్ని ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఏమంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రతీ సినిమా భారీ అంచనాల మధ్య వస్తుంది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం నాని సక్సెస్ కాలేకపోతున్నాడు. అయినా నానికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. గత చిత్రం టక్ జగదీష్ గనక భారీ హిట్ అందుకుంటే ఇప్పుడు నాని సినిమా మీద ఇంకో రేంజ్ అంచనాలుండేవి. కానీ, ఆ సినిమా తీవ్రంగా నిరాశపరచింది. కాస్త ఆ ప్రభావం ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ మీద పడుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.
సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్తో నిర్మించాడు. నాని కెరీర్లో ఇదే హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమా. కలకత్తా నేపథ్యంలో నాని డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా మీద ఇప్పుడు అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన టీజర్ సినిమా మీద అంచనాలను బాగా పెంచగా..ఇప్పుడు కొత్త ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోతో అంచనాలు మరింతగా పెంచారు.
Nani: పోటీతో పాటు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ కూడా..!
డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ కానుంది. అదే రోజు వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం కూడా రిలీజ్ కానుంది. అయితే వారం ముందు పాన్ ఇండియన్ సినిమా పుష్ప అదే రోజు గని సినిమా రిలీజ్ కావడంతో నానికి కొంత టెన్షన్ తప్పేలా లేదంటున్నారు. ఇక దీనికితోడు ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా గట్టిగా పడే అవకాశాలే ఉన్నాయంటున్నారు. గత రెండు చిత్రాలు వి, టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి నిరాశపరచాయి. దాంతో ఈసారి ఆ రిస్క్ తీసుకోకుండా శ్యామ్ సింగ రాయ్ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ముందు సోలోగా వస్తున్నామని అనుకున్నా ఇప్పుడు పోటీతో పాటు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ కూడా ఉంది. చూడాలి మరి నాని వీటన్నిటినీ తట్టుకొని సక్సెస్ సాధిస్తాడా లేడా.