కరోనా పుణ్యమా అంటూ థియోటర్స్ మూతపడితే ఓటీటీలకి రెక్కలొచ్చాయ్. ఇదే మంచి ఛాన్స్ అనుకొని రిలీజ్ రెడీగా ఉన్న సినిమాలకి మంచి ఆఫర్ ఇచ్చి ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడి సినిమాలని రిలీజ్ చేస్తున్నాయి. అన్నీ భాషల్లో చిన్న, మీడియం సినిమాలు ముందు రిలీజ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. కొత్త సినిమా చూడాలంటే ఇక థియోటర్స్ వెళ్ళనవసరం లేదు.. అన్న భావన కలిగేలా మైండ్ సెట్ ని మార్చారు.
ఆ తర్వాత బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాతో పాటు టాలీవుడ్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కిన నాని – సుధీర్ బాబు ల ‘ వి ‘, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన క్రేజీ మూవీ ‘ నిశ్శబ్ధం ‘ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. ముందుగా నాని నటించిన వి సినిమా రిలీజ్ చేశారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్స్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు.
ఈ సినిమా రిలిజయ్యాక డివైడ్ టాక్ బాగానే వచ్చింది. అయితే నేచురల్ స్టార్ నాని నేచురల్ పర్ఫార్మెన్స్, సుధీర్ బాబు డైనమిక్ రోల్ కి ప్రేక్షకులు కాస్త అట్రాక్ట్ అయ్యారు. ఆ రకంగా సినిమాకి పాజిటివ్ టాక్ కొంత వచ్చింది. మొత్తానికి ఫరవాలేదు అన్న టాక్ వచ్చింది తప్ప బ్లాక్ బస్టర్ సినిమా అని మాత్రం ఎవరు కితాబు ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత నుంచి అందరి దృష్టి అనుష్క నిశ్శబ్ధం సినిమా మీదే ఉండింది.
కాని ఈ సినిమా రిలీజయ్యాక నాని వి సినిమా తో కంపేర్ చేస్తూ అనుష్క నిశ్శబ్ధం కంటే నాని వి సినిమానే వెయ్యి రెట్లు బెటర్ అని చెప్పుకుంటున్నారట ప్రేక్షకులు. పరమ బోరింగ్ కథ, గ్రిప్పింగ్ లేని స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని విసింగించారన్న టాక్ వచ్చింది. మొత్తాని నిశ్శబ్ధం.. యూనిట్ సబ్యులతో పాటు ప్రేక్షకులకి షాక్ తగిలింది.