నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నిన్నుకోరి, మజిలీ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి వరకు కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు.
అలాగే టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యాం సింగ్ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం. కాగా నాని గత కొంతకాలంగా వైవిధ్య భరితమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాని ప్రకటించాడు.
నాని కెరీర్ లో 28వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా తాజాగా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీ నజ్రియా నటించబోతుంది. కాగా బ్రోచేవారు ఎవరురా సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయా ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇక ఈనెల 21న ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం. కాగా ఈలోపే ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే రెండు సినిమాలని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయా.. ఆ రెండు సినిమాలకి బ్రోచేవారు ఎవరురా, మెంటల్ మదిలో అన్న విభిన్నమైన టైటిల్స్ ని పెట్టాడు. ఇప్పుడు నాని సినిమా టైటిల్ కూడా అలానే ఉండబోతుందట. నాని 28 కి ” అంటే సుందరానికి ..” అన్న టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇదే టైటిల్ గనక నిజమైతే ఖచ్చితంగా నాని కి మంచి హిట్ దక్కే అవకాశం ఉంది. అయితే ఇదే టైటిల్ అన్న విషయం ఎలా బయటకి వచ్చిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.