అమరావతి, మార్చి 4: టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన విమర్శలు చేశారు.
తమ డేటాను దొంగిలించి హైదరాబాదు బ్రాండ్ పరువు తీశారని లోకేష్ విమర్శించారు. వైసిపి అధినేత జగన్ను దొంగబ్బాయితో పోల్చారు.
‘కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగిలించి హైదరాబాదు ఐటి బ్రాండ్ని దెబ్బతీసారు’ అని విమర్శించారు.
‘హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాలపై విఆర్ఒ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును ఎదుర్కొలేక ఐటి కంపెనీలపై దాడి చేసి ఉద్యోగులను అక్రమంగా అరెస్టు చేసారని తేలిపోయింది’ అని లోకేష్ ట్విట్ చేశారు.