(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు టిడిపి నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు లోకేష్తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడులను బెంజి సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన దీక్షలో పాల్గొని లోకేష్ తిరిగి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పలువురు టిడిపి కార్యకర్తలు లోకేష్ అరెస్టును అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు అదుపులోకి తీసుకున్న లోకేష్తో సహా టిడిపి నేతలను ఆవనిగడ్డ – విజయవాడ రహదారి మీదుగా తీసుకువెళ్లారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ను తీసుకువెళ్లినట్లు సమాచారం.