అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తోపాటు సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నేత నారాయణను బైక్పై వెనుక కూర్చొబెట్టుకుని లోకేష్ బైక్ నడిపారు. ర్యాలీలో మంగళగిరి పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇన్చార్జ్ నసీర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, పలువురు నేతలు పాల్గొన్నారు. అలాగే వినుకొండలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీ.వీ.ఆంజనేయులు పాల్గొన్నారు.