అచ్చెన్నాయుడు మరియు జెసి ప్రభాకర్ రెడ్డి ల తర్వాత టిడిపి నేతల ఆత్మస్థైర్యం గట్టిగా దెబ్బతింది. చంద్రబాబు నాయుడు పార్టీ యొక్క చర్యను ఖండిస్తూ టీడీపీ కేడర్ అంతా ఒకటయి భారీ ఎత్తున విరుచుకుపడుతుంది అనుకుంటే చివరికి అతను అనుకున్నంత హంగామా అయితే జరగలేదు. టిడిపి నేతల మరియు కార్యకర్తల వాయిస్ సోషల్ మీడియా వరకే పరిమితం అయింది. లాక్ డౌన్ దీనికి కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు వైసిపి పార్టీ పై పైచేయి సాధించే మంచి అవకాశాన్ని టిడిపి పార్టీ నాయకుడు నారా లోకేష్ చేజార్చుకున్నారని అంటున్నారు. అతను అనంతపురం పర్యటన చేయాల్సి ఉండగా దానిని అకస్మాత్తుగా లోకేష్ దానిని రద్దు చేసుకోవడం జరిగింది. అతను ఇదే సమయంలో కడప కి వెళ్ళవలసి రావడమే కారణమని చెబుతున్నారు.
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు తర్వాత అనంతపూర్ కు వెళ్లి లోకేష్ పర్యటించినట్లయితే పరిస్థితి వేరేలా ఉండేదని మరియు తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్ గా అధికార పార్టీ పై దాడి ఎదుర్కొంటుందని పార్టీ వర్గాల్లో బలం చేకూరుతుందని భావిస్తున్నారు. మరి ఈ పర్యటన రద్దు టిడిపి కి ఎంత నష్టం చేకూరుస్తుందో వేచి చూడాలి.