అమరావతి: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘జగన్ అసమర్థత, అహంకారం కారణంగా రిలయన్స్, అదానీ వంటి అగ్రగామి కంపెనీలు బై బై ఏపీ అంటూ ఒకదాని వెంట ఒకటి రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయి. ఆ ప్రముఖ పారిశ్రామిక సంస్థల వెంటపడి, వాటిని ఏపీకి తీసుకురావడానికి ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంటే బాధగా ఉంది ‘ అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
.@ysjagan గారి అసమర్థ, అహంకార పోకడలతో రిలయన్స్, అదానీలాంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు #ByeByeAP అంటూ ఒకదానివెంట ఒకటి రాష్ట్రం విడిచిపోతున్నాయి. ఆ సంస్థల వెంటపడి, ఒప్పించి ఏపీకి తేవడానికి మేము పడిన కష్టమంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరవుతుంటే బాధగా ఉంది.https://t.co/ML31GVI1Qd
— Lokesh Nara (@naralokesh) November 6, 2019
ఇక ఇసుక కొరతపై ట్వీట్ చేస్తూ.. ‘ఐదు నెలల్లోనే ఇంత దారుణమైన పరిస్థితులు తెస్తే, ఐదేళ్ళలో ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదంటున్నారు ప్రజలు. జగన్ ను నమ్మి మీకు ఓటేసిన పాపానికి ప్రజలను ఇలా చావు ముందు నిలబెడతారా? ప్రజలను ఇన్నిరకాలుగా బాధ పెడుతూ మీకెలా నిద్రపడుతోంది? కాస్తయినా మానవత్వం ఉండాలిగా!’ అని మరో ట్వీట్ చేశారు.
ఐదు నెలల్లోనే ఇంత దారుణమైన పరిస్థితులు తెస్తే, ఐదేళ్ళలో ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదంటున్నారు ప్రజలు. @ysjagan గారూ! నమ్మి మీకు ఓటేసిన పాపానికి ప్రజలను ఇలా చావు ముందు నిలబెడతారా? ప్రజలను ఇన్నిరకాలుగా బాధ పెడుతూ మీకెలా నిద్రపడుతోంది? కాస్తయినా మానవత్వం ఉండాలిగా! pic.twitter.com/G6JtpbaYjS
— Lokesh Nara (@naralokesh) November 6, 2019