అమరావతి: రైతులపై సీఎం జగన్ కి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా? అని నిలదీశారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్ గారి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ చెప్పారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు జగన్ గారు అంటూ ట్వీట్ చేశారు. ఓ వీడియోని కూడా పోస్ట్ చేశారు.
రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్ గారి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు జగన్ గారు.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 4, 2020