చంద్రబాబు ప్రభుత్వం లో జరిగిన ప్రతి అవినీతి స్కామ్ విషయంలో ప్రతి శాఖపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతేకాకుండా ప్రత్యేకమైన క్యాబినెట్ కమిటీ వేసి ఇప్పటికే జగన్ సర్కార్ నివేదిక తెప్పించుకుంది. ఈ నివేదిక ఆధారంగా కార్మిక శాఖ లో ESI కుంభకోణంలో కొన్ని వందల కోట్ల విషయంలో స్కాం జరిగినట్లు నిర్ధారించి అప్పట్లో ఆ శాఖకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు ని ఇటీవల అరెస్టు చేయడం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు వైసిపి ఫోకస్ మాజీ మంత్రి నారాయణపై పడినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. రాజధాని అమరావతి భూముల విషయంలో నారాయణ భూ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉండటంతో… త్వరలో ఆయనపై విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మరోపక్క నారాయణ వైసీపీ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోంది.
కానీ అమరావతి రాజధాని భూ కుంభకోణం విషయంలో ఎవరినీ వదలకూడదు..అనే ప్రతి ఒక్కరిని ప్రజలను మోసం చేసిన వారిని జైలుకు పంపించాలని ఫుల్ క్లారిటీ తో జగన్ ఉన్నారట. ఈ విషయంలో నారాయణ పాత్ర లేకపోతే అప్పుడు పార్టీలో చేర్చుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీలో టాక్. మొత్తంమీద చూసుకుంటే నారాయణ పొలిటికల్ కెరియర్ జైలు కా? లేకపోతే వైసీపీలోకా? అన్నట్టుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.