నారాయణమూర్తి నటించిన ఒరే రిక్షా సినిమా రిలీజ్ అయ్యి పాతిక సంవత్సరాలు కావటంతో ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ దాసరి నారాయణరావు దర్శక ప్రతిభ శైలిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒరే రిక్షా సినిమా తన కెరీర్ కి ఎంతో కీలకంగా రాణిచిందని ప్రజలకు తనని బాగా దగ్గరికి చేర్చిందని నారాయణ మూర్తి తెలిపారు.
అలాగే సినిమాకి అన్ని పాటలు గద్దర్ రాశారని, చాలా అద్భుతంగా వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ విషయం గురించి యాంకర్ నారాయణమూర్తిని ప్రశ్నించారు. రజినీ కొత్త పార్టీ పై మీ అభిప్రాయం ఏమిటి అని.. యాంకర్ వేసిన ప్రశ్నకు నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏమన్నారంటే అంతకుముందే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది ఫీల్ అయ్యారని తెలిపారు. కానీ ఇప్పుడు సరైన టైంలో రజినీకాంత్ రాజకీయ రంగంలో అడుగుపెట్టాలని పేర్కొన్నారు. ఎంజీఆర్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ రజిని అని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేయాలని రజనీకి ఉంది ఇది గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా రజినీకాంత్ నిలబడాలి అని నారాయణమూర్తి ఈ సందర్భంగా సూచించారు. ఆధ్యాత్మిక రాజకీయాలు అంటూ మళ్లీ లాంగ్ గ్యాప్ ఇవ్వకూడదని, ముఖ్యమంత్రిగా వేరే అభ్యర్థిని కూడా రజిని పెట్టకుండా ఆయన పోటీ చేయాలని సూచించారు.