సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం గురించి మాట్లాడుతూ సామాజిక న్యాయం జరగాలంటే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అందరికీ అవసరమని, జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా చాలా మంది రాజకీయ మేధావులు అంబేద్కర్ ఇంకా మరి కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పుకొచ్చారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సరైన సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల జీవితాలలో అభివృద్ధి కోసం జగన్ తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని నూటికి నూరుపాళ్లు సమర్థిస్తున్నట్లు నారాయణ మూర్తి తెలిపారు.
ఇక తెలుగు భాష గురించి మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రులు ఇంటిలోనే వారికి ఆ విధమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా తెలుగు భాష మరుగు పడిపోకుండా కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ పెట్టాలని నారాయణమూర్తి సూచించారు. ఏది ఏమైనా ఇంగ్లీష్ మీడియం విద్యావిధానం వల్ల పేదవాళ్ల జీవితాలు మారతాయని, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు బడుగు బలహీన వర్గాల జీవితాలలో మార్పు తీసుకురావడమే కాక సామాజిక న్యాయం చేసినట్లు అవుతుందని ఆర్ నారాయణ మూర్తి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.