భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఈరోజు ఫోన్ చేసి పలు విషయాలపై మాట్లాడారు. చైనాతో ఉద్రిక్తల నేపథ్యంలో మోదీ రష్యా అధ్యక్షునికి ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని విక్టరీ డే వేడుకలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలియజేసారు. అలాగే వరసగా 16 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షునిగా పుతిన్ కొనసాగనుండడం, దానికి తగిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో మోదీ కంగ్రాట్స్ చెప్పారు. ఇక కరోనా కట్టడికి ఇరు దేశాలు అవలంబిస్తున్న పద్దతులను ఒకరినొకరు అడిగి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత్ కు తామెప్పుడూ అండగానే ఉంటామని పుతిన్ తెలియజేసారు.