ఈ రోజుల్లో సినిమా హీరోలు, ఇతర నటులు, నటీమణులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. నాగచైతన్య, ధనుష్ వంటి సినీ సెలబ్రిటీలు కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే విడాకులు ఎలా జరుగుతున్నాయో మళ్లీ పెళ్లిళ్లు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అయితే ఈ పెళ్లిలన్నీ దాదాపు సినిమా ఇండస్ట్రీ వాళ్ల మధ్యే జరుగుతున్నాయి. ఒక సినిమాలో నటించడం ఆ మూవీ హీరో/హీరోయిన్ను ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా మారుతోంది. మళ్లీ విడాకులు, పెళ్లి అనే తంతు ఇదంతా కామన్ అయిపోయింది. ఆ జాబితాలో నరేష్ కూడా చేరిపోయాడు.
స్పందించిన కృష్ణ
నరేష్ ముడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాడు. మూడో భార్య రమ్య రఘపతితో వేరుగా ఉంటున్నాడు. అలా సింగిల్ గా ఉంటున్న నరేష్ పవిత్రా లోకేష్ పై కన్నేసాడని, పెళ్లి చేసుకోవడానికి రెడీ కూడా అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి నరేష్ కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు. అయితే తాజాగా నరేష్ తండ్రి ఘట్టమనేని కృష్ణ ఈ విషయంపై స్పందించిన్నట్లు సన్నిహితుల టాక్. నరేష్ ని ఉద్దేశిస్తూ “వాడి జీవితం వాడి ఇష్టం. ఈ పెళ్లి వ్యవహారం అంతా నరేష్కే వదిలేస్తున్నాను. ఈ విషయం గురించి నన్ను ఏం అడగొద్దు” అని కృష్ణ ఈ వ్యవహారం గురించి అడిగిన వారందరికీ సింపుల్గా సమాధానం ఇస్తున్నారట. బంధువులు, స్నేహితులు “నరేష్ ఇలా రచ్చకెక్కి పరువు తీసుకుంటుంటే కృష్ణ గారు మీరు ఏం చెప్పరా?” అని అడుగుతున్నారట. అయితే ఇలాంటివి ప్రశ్నలను ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారని సమాచారం.
కుటుంబంలో గొడవలు
ఈ విషయం గురించి మహేష్ బాబుతో కూడా కృష్ణకు గొడవ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో పవిత్ర వచ్చి ఘట్టమనేని ఫ్యామిలీలో గొడవలు పెట్టిందని ఘట్టమనేని ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు.