ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నిటికంటే ఎక్కువగా ఒక్క వ్యవహారం గురించి చర్చలు జరుగుతున్నాయి. అది పవిత్రా లోకేష్, నరేష్ల మధ్య ఉన్న రహస్య సంబంధం గురించి అని చెప్పొచ్చు. వీరి రిలేషన్ గురించి నరేష్ మూడో భార్య రమ్య రఘపతి మీడియా ముందు రచ్చరచ్చ చేసింది. నరేష్, పవిత్రను రమ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మీడియా అటెన్షన్కు దారి తీసింది. వారిద్దరిని ఒక హోటల్ రూమ్లో చూసి ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. పవిత్రని చెప్పుతో కొట్టబోయింది. ఇదంతా పక్కనపెడితే నరేష్, పవిత్ర చాలా సినిమాల్లో కలిసి నటించారనేది కాదనలేని నిజం. అయితే ఏ సినిమాలో నటిస్తున్నప్పుడు వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు వీళ్ల జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకోడానికి ప్రేక్షకులు ఆసక్తి కనపరస్తున్నారు. మరి ఆ వివరాలు చూసేద్దామా.
ఆ షూటింగ్లోనే కెమిస్ట్రీ
ఆఫ్స్క్రీన్లో నరేష్, పవిత్ర కలిసి ఎప్పటినుంచో మీడియాకి కనిపిస్తున్నారు. వారిద్దరూ కలిసి బయట కలవడం, ఇద్దరూ ఒకే సినిమాలో నటించడం సినిమా ఇండస్ట్రీ నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంది. కానీ ఈ మధ్యే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సామాన్యుల దృష్టిని కూడా ఆకర్షించింది. దానితో ఇండస్ట్రీ వాళ్లు, సినీ ప్రేక్షకులు వీరి గురించి విషయం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే వీరిద్దరూ 2018లో ‘సమ్మోహనం’ అనే సినిమా షూటింగ్లో బాగా కనెక్ట్ అయ్యారట. మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు నరేష్కి దగ్గర బంధువే అవుతారు. దాంతో ఈ సినిమాలో ఆయనకి సుధీర్ బాబుకి తండ్రిగా నటించే అవకాశం వచ్చింది. నటీమణి పవిత్రకి తల్లిగా చేసే ఛాన్స్ దక్కింది. అప్పుడే వారి మధ్య ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ చిగురించిందని టాక్ నడుస్తోంది.
ఇదే నిజమని నెటిజన్లు టాక్
ప్రస్తుతం సమ్మోహనం సినిమాలోని నరేష్, పవిత్ర సన్నివేశాలు వైరల్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు అనుగుణంగా ఆ సినిమాలోని సనివేశాలు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ మూవీలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ సినిమా చేసే సమయానికి నరేష్ తన భార్యకి దూరంగా ఉంటున్నాడట. దానితో అతను పవిత్రకి దగ్గర అయి ఉండొచ్చని అంటున్నారు. ఈ సినిమా తరువాత ఆమెపై ప్రేమ పెంచుకున్న నరేష్ పవిత్రతో నటించడానికే బాగా మొగ్గు చూపినట్టు కూడా చెబుతున్నారు. మొత్తానికి సమ్మోహనం సినిమానే వీరిద్దరి మధ్య బంధానికి బీజం వేసిందని అంటున్నారు.