ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ పదవీకాలం 9 నెలలు ముగిసిపోయింది. బిసిసిఐ కొత్త రాజ్యాంగం ప్రకారం బోర్డు లేదా క్రికెట్ సంఘాల్లో ఆరేళ్ల పదవిలో ఉన్న తర్వాత సదరు వ్యక్తి కనీసం మూడేళ్ల విరామం తీసుకోవాలి. ఐదేళ్ళపాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగిన దాదా…. ఇదే క్రమంలో గత ఏడాది బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మొత్తానికి సోమవారంతో అతను వరుసగా బోర్డు లేదా అనుబంధ క్రికెట్ అసోసియేషన్ లో ఆరేళ్ళు ఒక పదవిని అనుభవించారు కాబట్టి అతనికి మూడేళ్ల కూలింగ్ పీరియడ్ తప్పదు.
ఇక్కడ విశేషం ఏమిటంటే గంగూలీ బిసిసిఐ ప్రెసిడెంట్ గా కొనసాగాలని ఇటు భారత క్రికెట్ అభిమానులు అందరూ తో సహా బోర్డు సభ్యులు కూడా భావిస్తున్నారు. అందుకే బోర్డు రాజ్యాంగ సవరణతో ఆ కూలింగ్ రూల్ ని ఇటీవల మార్చిన బిసిసిఐ కార్యవర్గం అందుకు ఆమోదం కోసం సుప్రీం కోర్టు వద్దకు వెళ్ళింది. అయితే కోర్టు అనూహ్యంగా విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేయడంతో గంగూలి ప్రస్తుతానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం.
తన తొమ్మిది నెలల పదవీ కాలంలోనే గంగూలి భారత క్రికెట్ లో ఎంతో పురోగతి తీసుకువచ్చాడని చాలా మంది బిసిసిఐ పెద్దలు మరియు మాజీ క్రికెటర్లు కొనియాడారు. అసలు భారత్ క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిన కెప్టెన్ గా గంగూలీ ఇప్పుడు బోర్డు మెంబబర్ గా కూడా తనదైన శైలిలో పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం. దాదాపు భారతదేశంలోని క్రికెట్ అభిమానులు అతనికి మద్దతుగా నిలవడం మామూలు విషయం కాదు. ఎంతైనా భారత క్రికెట్లో మళ్లీ ఆఫ్ ఫీల్డ్ లో గంగూలీ ‘దాదాగిరి‘ మొదలవ్వాలని కోరుకుంటున్నారు.