హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది.
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తుంటారనీ అలాంటి చోట ఇలాంటి ఘోరం జరగడం దారుణమనీ అన్నారు. మహిళలకు భద్రత లేనిచోట తల్లిదండ్రులు వారి బిడ్డలను ఎలా బయటకు పంపించగలరని ప్రశ్నించారు. తోడేళ్లు రోడ్ల మీద పడి యువతిని వేటాడి చంపేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ నిమిత్తం జాతీయ మహిళా కమిషన్ తరుపున ఒకరిని హైదరాబాద్కి పంపిస్తున్నట్టు తెలిపారు. నిందితులకు శిక్ష పడేంత వరకు మహిళా కమిషన్ వదిలిపెట్టదని ఆమె అన్నారు.
కాగా ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి స్పందిస్తూ దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. డిజిపి నుండి పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. దోషులకు న్యాయసహాయం చేయవద్దని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు.
Sending a member to Hyderabad to assist the family and take it up with the police @NCWIndia won't leave any stone unturned till these perpetrators get the punishment they deserve. https://t.co/kYBQivLKN0
— Rekha Sharma (@sharmarekha) November 29, 2019