నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను విచారణ చేశారు. ఇప్పటికే ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ అధికారులు ఉన్నట్టుండి మల్లికార్జున ఖర్గేను కూడా విచారణకు పిలిచారు. ఈడీ నుండి సమన్లు అందుకున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నా ఖర్గే విచారణకు హజరయ్యారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఖర్గే ను విచారణ కోసం ఈడీ అధికారులు తమ కార్యాలయానికి కాకుండా నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి పిలిచారు. ఈ కార్యాలయంలోనే ఈడీ బుధవారం సీజ్ చేసిన యంగ్ ఇండియా కార్యాలయం ఉన్న సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి చేరుకున్న ఖర్గేను ఈడీ అధికారులు దాదాపు అయిదు గంటల కు పైగా విచారించారు. విచారణ అనంతరం ఖర్గే నేషనల్ హెరాల్డ్ కార్యాలయం నుండి కొద్ది సేపటి క్రితం బయటకు వచ్చారు.
అల్ ఖైదా అగ్రనేత జవహరీ మృతి చెందలేదంటూ తాలిబన్ల సంచలన ప్రకటన