Ys Jagan : సరిగ్గా లాక్ డౌన్ సమయంలో విశాఖపట్టణంలో ఎల్జి పాలిమర్స్ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆ టైంలో హుటాహుటిన రంగంలోకి దిగి బాధితులను పరామర్శించడం మాత్రమే కాక మృతి చెందిన వారికి కోటి రూపాయల పరిహారం ఇవ్వటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఎక్కడివారు అక్కడ స్పృహ తప్పి పడిపోవడం మాత్రమే గాక వాంతులతో మరియు మూర్ఛ వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ ఆర్తనాదాలు..ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంత మాత్రమే కాక వ్యర్థ విషవాయువులు వెలువడిన ఆ ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల చెట్లు మరియు పశువులు చాలావరకు ప్రకృతి దెబ్బతినటం జరిగింది. అయితే సకాలంలో అది కూడా కరోనా టైంలో జగన్ ప్రభుత్వం స్పందించడంతో చాలావరకూ పరిస్థితిని అదుపు చేసినట్లు అప్పట్లోనే వార్తలు రావడం మనకందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో తాజాగా మరోసారి ఎన్.హెచ్.ఆర్.సి తాజాగా ఎల్జి పాలిమర్స్ ఘటనపై జగన్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఎల్జి పాలిమర్స్ విషవాయువులు లీకైన సమయంలో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అద్భుతం అని పేర్కొంది. బాధితులకు పరిహారం అందించడంలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలు అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం అందజేసిన కార్యాచరణ నివేదిక అద్భుతం అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఘటన సమయంలో జగన్ సర్కార్ స్పందించిన తీరు పై పొగడ్తల వర్షం కురిపించింది.