అమరావతి, ఫిబ్రవరి 25: నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణలో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మరో జాతీయ పురస్కారం లభించింది.
ఢిల్లీలోని మావంలకార్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం నేషనల్ వాటర్ అవార్డ్స్ 2018 కార్యక్రమం జరిగింది.
ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్కు మూడవ బహుమతి లభించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్రం తరుపున జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేషనల్ అవార్డును మంత్రి గడ్కరీ చేతుల మీదుగా అందుకున్నారు.
నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, మిడియా సంస్థలకు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ అవార్డులను అందించారు.
భూగర్భజలాల పెంపుదలతో అనంతపురం జిల్లాకు ప్రధమ బహుమతి, విశాఖ జిల్లా ద్వితీయ బహుమతిని కైవశం చేసుకున్నాయి.