అర్హులైన గ్రామీణ విద్యార్థులకు ప్రామాణిక విద్యను అందించడం, జాతీయ సమైక్యతకు ఇతోధిక కృషి చేయడం వంటి సదాశయాలతో ఏర్పాటైన సంస్థ జవహర్ నవోదయ విద్యాలయం. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటయ్యాయి.
ఇవి దాదాపుగా ప్రతి జిల్లాలో ఆదర్శ పాఠశాలలుగా అలరారుతున్నాయి. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఇక్కడ విద్యను అందిస్తున్నారు. ఆరో తరగతిలో ప్రవేశానికి (2021-22) గాను నోటిఫికేషన్ విడుదలైంది.ఒక్కసారి ఎంపికైతే చాలు. ఇంటర్ వరకు చదువు, వసతి, భోజనం అంతా ఉచితమే.
వెబ్సైట్:
2020-21 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి నేరుగా సంస్థ పోర్టల్ https://navodaya.gov.in వెబ్సైట్లో ద్వారా దరఖాస్తును సమర్పించుకోవాలి.సెప్టెంబర్ 15చివరితేదీ. 2020 జనవరి 11 శనివారం ఉదయం 11.30 గం.లకు పరీక్ష నిర్వహిస్తారు.ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదోతరగతి చదివే విద్యార్థులు ఈ ప్రవేశానికి అర్హులు. ప్రతి సంవత్సరం 10000లకు పైగా దరఖాస్తులతో ప్రవేశాలకు చాలా డిమాండ్ ఉంది. మే 01, 2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించి ఉండాలి. 80 సీట్లలో 30 శాతం బాలికలకు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు 75 శాతం అంటే 60 సీట్లు, మిగతా పట్టణ ప్రాంత చిన్నారులకు కేటాయించారు. విద్యార్థి ఫొటో, సంతకం, తల్లి/తండ్రి/సంరక్షకుని సంతకంతో దరఖాస్తులు సమర్పించాలి.
ఎగ్జామ్ ఇలా: పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లిష్.. ఇలా తాను కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసుకోవచ్చు. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మూడు సెక్షన్లలో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు కేటాయించారు. రుణాత్మక మార్కులు లేవు.ఎంపికైన బాలికలు, ఎస్సీ, ఎస్టీలు, అల్పాదాయ వర్గాలవారు ఆరో తరగతి నుంచి +2 వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజనం పొందవచ్చు. మిగిలినవారు తొమ్మిదో తరగతి నుంచి నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఉన్నత బోధన ప్రమాణాలు నవోదయ విద్యాలయాల సొంతం.సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు.వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ.. తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు.
గమనించండి :
అర్హత: 2020-2021 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: మే 1, 2008 – ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 15, 2020
పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021
వెబ్సైట్: https://navodaya.gov.in