తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.
తన పార్టీ కి నయా భారత్ అనే పేరును ఇప్పటికే కెసిఆర్ ఖరారు చేశారని.. చురుగ్గా రిజిస్టర్ యత్నాలు కూడా సాగుతున్నాయని ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ వార్తను ప్రచురించింది.త్వరలో బిజెపి రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్ష తరహా పాలనను భారత్ పై రుద్దే అవకాశముందని దీన్ని అడ్డుకునేందుకు కెసిఆర్ పావులు కదుపుతున్నారని ఆంధ్రజ్యోతి ఆ కథనంలో పేర్కొంది.జమిలి ఎన్నికల తర్వాత బిజెపి అధ్యక్ష పాలనకు రంగం సిద్ధం చేసుకుంటోందని.. అదే జరిగితే.. ఇకపై లోక్సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలకే ప్రాముఖ్యం ఉంటుందని.. అసెంబ్లీ ఎన్నికలకే ప్రాంతీయ పార్టీలు పరిమితం అవుతాయని.. ఈ వ్యూహానికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి నయా భారత్ పార్టీని పెట్టబోతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.ఈ నేపథ్యంలో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని నడపగలిగే సామర్థ్యం కెసిఆర్ కు ఉందా ఆయన కెపాసిటీ సరిపోతుందా అన్న విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
కెసిఆర్ గత చరిత్రను పరిశీలిస్తే ఆయన ఘటనాఘటన సమర్థుడు. టిడిపిలో ఉంటూ మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి ప్రత్యేక తెలంగాణ సాధించి ఆ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనుడు. పైగా యూపీఏ ప్రభుత్వ హయాంలో కొన్ని రోజులు కేంద్ర మంత్రిగా కూడా కేసీఆర్ పనిచేశారు. చాలా సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. తెలంగాణ సాధించే క్రమంలో ఢిల్లీ లో వివిధ జాతీయ పార్టీల తోటి ఆయన సంబంధాలు నెరిపారు. ఒక దశలో మహాకూటమి అంటూ హడావిడి చేసి అనేక ప్రాంతీయ పార్టీలను ఏకం చేశారు. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ బిజెపియేతర పార్టీల అధినేతల తో ప్రత్యక్ష సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
రాజకీయ వ్యూహాలు పన్నడంలో తిరుగులేని నాయకుడు కేసీఆర్.జాతీయ రాజకీయాలకు అవసరమైన హిందీ భాషపై కేసీఆర్ కి అద్భుతమైన పట్టు ఉంది.ఇన్ని ప్లస్పాయింట్ లు ఉన్నందున కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టినా సక్సెస్ కాగలరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాక ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున జాతీయ పార్టీ నడపడానికి అవసరమైన నిధులకు కూడా కేసీఆర్ కు ఇబ్బంది ఉండదనే చెప్పాలి.బిజెపి దెబ్బకు డీలా పడిన కాంగ్రెస్ కమ్యూనిస్టు తదితర బిజెపి యేతర పార్టీలన్నీ కూడా కెసిఆర్ నయా భారత్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. బిజెపి కూడా కెసిఆర్ ని వేధించడానికి వాళ్ల దగ్గర ఎలాంటి పాయింట్లు లేవు .ఆయనపై కేసులు కూడా లేవు. అందువల్ల కేసీఆర్ ఎవరికీ భయపడాల్సిన పరిస్థితి కూడా లేదు.ఈ కోణాలు అన్నింటిని విశ్లేషిస్తేజాతీయ పార్టీ పెట్టి కూడా కేసీఆర్ సక్సెస్ కాగలరనది రాజకీయ పండితులు అభిప్రాయంగా వినిపిస్తోంది