మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలు దక్కించుకుని తనకంటూ ఒక గర్తింపును సంపాదించుకుంది కేరళ బ్యూటీ నయనతార. మళయాలీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్‘మనస్సినక్కరే’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఈ బ్యూటీ పరిచయమైంది. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళంలో అయ్య, చంద్రముఖి, గజిని వంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. వీటి తర్వాత తెలుగుతో నటించిన లక్ష్మీ, బాస్ వంటి మూవీలు కూడా నయనకు మంచి పేరును తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత 2006 లో వచ్చిన వల్లభ సినిమాతో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన అజిత్ తో కలిసిన నటించిన బిల్లా మూవీలో ఈ బ్యూటీ హాట్ గా కనిపించి సెక్సీయెస్ట్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది. తెలుగు లో ఈ బ్యూటీకి అనుకున్న గుర్తింపు రాలేకపోయినా తమిళంలో మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ భామ. అయితే ఈ బ్యూటీ శ్రీరామ రాజ్యం సినిమాలో బాలయ్య పక్కన సీతగా నటించి నంది అవార్డును ఆమె సంపాదించుకున్నారు.
ఆ తర్వాత మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి, దర్భార్ వంటి ఇంకొన్ని సినిమాల్లో నటించారు. ఆ సినిమాల తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన నటించే అవకాశాలు భాగానే వస్తున్నట్టు సమాచారం. కాగా తాజాగా కూడా టాలీవుడ్ ఓ సీనియర్ హీరో సరసన నటించే నటించేందుకు దర్శక, నిర్మాతలు ఆమెను అడిగినట్టు సమాచారం. అయితే ఆమె నేను నటించలేనని ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా చేసేది లేదని తెగేసి చెప్పిందట.
అయితే దానికి రీసన్ మాత్రం సినిమాల్లో ఖాళీ లేకపోవడం వల్లనే అని చెప్పిందట. అయితే ఆమె నటించమన్న సినిమాలో నటించే ఆ సీనియర్ హీరో ఎవరు అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. అయితే ఈ సినిమాలో నటించకపోవడానికి అసలైన కారణం మాత్రం ఆ సినిమాలో ఆమె నటించే పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంమేనని వార్తలు వినిపిస్తున్నాయి.